వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్

M Espitha Chowdary | 29 June 2025 03:43 PM | ఆంధ్రప్రదేశ్
గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : అధికారం చేతికి వచ్చిందన్న అలసత్వం ప్రదర్శించవద్దని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ పతనాన్ని ఉదాహరణగా చూపుతూ, అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు 'సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.
← Back Share Download